చేసిన సినిమాలు తక్కువే అయినా, మెగా బ్రదర్ నాగ బాబు మాత్రం ఎక్కువగా వివాదాలతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఏ వ్యాఖ్య చేసినా ఇటీవల సంచలనంగా మారుతుంది అనేది వాస్తవం. ఇక గాంధీజిని చంపిన నాథురాం గాడ్సే ని ఆయన జయంతి సందర్భంగా కొనియాడటం వివాదాస్పదంగా మారింది.
దీనిపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. “కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే... ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్ ''నాకు కూడా''... ''అని'' గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా” అని ట్వీట్ చేసారు.
కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే...
— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 19, 2020
ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్
''నాకు కూడా''...
''అని''
గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు.
మన్నించండి మహత్మా 🙏 pic.twitter.com/RD1ziaIlrt