వచ్చే నెల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు దేశంలో అలజడి కోసం ఉగ్రవాదులు ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందని నిఘావర్గాల హెచ్చరికలు జారీ చేసాయి. దీనితో రక్షణ శాఖతో పాటుగా అన్ని రాష్ట్రాల పోలీసులు అలెర్ట్ అయ్యారు. జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్‌ దాడి కూడా జరిగింది.

అదే తరహాలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి దేశ రాజధానిపై దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీనితో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగడం అలాగే త్వరలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపధ్యంలో పాక్‌ ఉగ్రమూకలు కీలక ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విద్రోహ డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తొలిసారిగా శిక్షణ ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: