మనిషి తప్పులు చేయడం సహజం..అయితే వాటిని చాలా ఓర్పు తో పరిష్కరించుకొని ముందుకు సాగితే సంసారం సాఫిగా సాగుతుంది. లేకుంటే గాడి తప్పుతుంది. సంసారం సాఫీగా సాగితే మాత్రం చాలా ఆనందంగా వుంటుంది లేకుండా వుంటే అనేక దారునాలు వెలుగు చూస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. ఓ మహిళ కోపం తో భర్తను క్షణికావేశంలో తన భర్తను 140 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపింది. అసలు ఎందుకు అలా చేసింది అనే విషయాలు మాత్రం అందరినీ ఆలోచనలో పడేసింది.. అంతటితో తన కోపం తగ్గలేదు. భర్త తలను ముక్కలు ముక్కలుగా కోసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది..


వివరాల్లొకి వెళితే.. పామ్ బీచ్ కౌంటీలోని పామ్ స్ప్రింగ్స్ కౌంటీ ప్రాంతానికి చెందిన ఏండ్ల జోన్ బుర్కే, ఏండ్ల భర్త మెల్విన్ వెల్లర్‌ భార్యాభర్తలు. మెల్విన్‌ అవిటి వాడు తను ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాడు కాదు.. అయితే ఏమైందో తెలియదు కానీ ఇటీవల జోన్ బుర్కే తన భర్తను మాంసం కోసే కత్తితో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ భయానక ఘటన గురించి 41 ఏళ్ల కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది కదా..అవును ఇది నిజంగా జరిగిన ఘటన అనే చెప్పాలీ.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.. అక్కడ వంట గదిలో రక్తపు మడుగులో పడివున్న వ్యక్తిని చూసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మృతదేహంపై 140 కత్తిపోట్లను గుర్తించారు. మృతుడి కపాలం బాగా చిద్రమైందని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భర్తను కర్కశంగా హతమార్చిన జోన్ బుర్కేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య కింద కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని ఎలా ఎందుకు చంపింది అనేది మాత్రం చెప్పలేదు. మౌనంగా ఉండటంతో ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు వైద్యులు ఆలొచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: