ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం గంట గంటకు పెరిగిపోతుంది.. రెండో దశ కరోనా వల్ల చాలా మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. వైరస్ సోకిన కొద్ది గంటలకే ఇలా ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.. అయిన కూడా మహమ్మారి తీవ్రత మాత్రం ఎక్కడా తగ్గలేదు.. ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. ఎన్‌డబ్ల్యుడీఏ ఇంజనీర్లు, క్లర్కు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసారు..


మొత్తం 62 పోస్టులకు దరఖాస్తు లు కోరుతుంది..

జూనియర్‌ సివిల్‌ ఇంజనీర్లు: సివిల్‌ విభాగంలో 16 పోస్టులు ఉన్నాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి

హిందీ ట్రాన్స్‌లేటర్‌: ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్టుగా హిందీలో పీజీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు: ఇవి 5 పోస్టులు ఉన్నాయి. కామర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ కంపెనీ సెక్రటరీ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. నిర్ధేశిత అనుభవం తప్పనిసరి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

అప్పర్‌ డివిజన్‌ క్లర్కులు: ఇవి 12 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఎంఎస్‌ వర్డ్‌, ఎక్స్‌ఎల్‌, పవర్‌ పాయింట్‌, ఇంటర్‌నెట్‌ అంశాల్లో అవగాహన అవసరం. అభ్యర్థి

వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టెనోగ్రాఫర్లు: అయిదు పోస్టులు ఉన్నాయి. ఇంటర్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు నిమిషానికి 80 పదాల టైపింగ్‌ వేగం ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు.

లోయర్‌ డివిజన్‌ క్లర్కులు: ఇవి 23 పోస్టులు ఉన్నాయి. ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లీష్‌ టైపింగ్‌ తెలిసి ఉండాలి. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌, ఇంటర్నెట్‌ అంశాల్లో అవగాహన తప్పనిసరి..


ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ..జూన్‌ 25..

nwda.gov.in అధికారిక వెబ్ సైట్ లో చూసి పూర్తి వివరాలను ఒకసారి చదివి అప్లై చేసుకోవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: