సాధారణంగా చాలా మంది పిల్లలలో ఇమ్యూనిటీ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. అయితే ముఖ్యంగా కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా.. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో ఒక్కసారి చూద్దామా.

ఇక  పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలని చెబుతున్నారు. అయితే కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కాగా.. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిదని చెబుతున్నారు. అంతేకాక.. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్‌ ఎ, బి2(రైబోఫ్లేవిన్‌) కోడిగుడ్డులో లభిస్తాయని తెలిపారు. ఇక ఆకుకూరలు, మునగకాయలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలని చెబుతున్నారు. అయితే వీటిలో ఫైబర్‌తో పాటు ఐరన్‌, జింక్‌, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి.

అయితే పెరుగులో ప్రోబయోటిక్స్‌, విటమిన్‌ బి12 దొరుకుతుంది. ఇవి పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుందన్నారు. అంతేకాదు.. ఇమ్యూనిటీని పెంచుతుందని తెలిపారు. అందుకే.. పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్‌ యోగర్ట్‌, వెజిటబుల్స్‌ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చునని చెబుతున్నారు. సాధారణంగా  పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంతేకాక.. పిల్లలకు రోజూ పసుపు ఆహారంలో ఇవ్వడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. ఇక పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చునన్నారు.

అంతేకాదు.. బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్‌, అప్రికాట్స్‌ వంటివి ఎక్కువగా తినిపించాలని తెలిపారు. ఇవి మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడంలో దోహదపడుతుంది. అంతేకాక.. పిల్లలకు స్వీట్స్‌, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్‌, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదని చెబుతున్నారు. ఇది ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. అయితే పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి మరి. ఇక  ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: