టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటనతో పాటు రచయితగా కూడా వ్యవహరిస్తూ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విలక్షణ నటుడు అడివి శేష్, ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎవరు. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైం థ్రిల్లర్ మూవీ నుండి టీజర్ మరియు ఒక సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టాయి. ఇకపోతే ఈ సినిమా అధికారిక ట్రైలర్ ను ఇటీవల నాచురల్ స్టార్ నాని చేతులమీదుగా విడుదల చేయించింది సినిమా యూనిట్. 

రెజీనాపై ఘోరంగా జరిగే రేప్ అటెంప్ట్ సీన్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్, రకరకాల ఆసక్తికర సన్నివేశాలతో ముందుకు సాగింది. విక్రమ్ వాసుదేవ్ అనే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ట్రైలర్ లో ఆయన పలికిన డైలాగ్స్, సినిమా పై ఆసక్తిని మరింత రేకెత్తిస్తాయి అని చెప్పవచ్చు. ఇకపోతే మూడు రోజుల క్రితం రిలీజయిన ఈ సినిమా ట్రైలర్, విపరీతమైన వీక్షకాభిమానంతో ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండడంతో, హీరో శేష్ ఆనందం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 

మొదట ఈనెల 23న విడుదలవుతుందని భావించిన ఈ సినిమాను సాహో విడుదల వాయిదా కారణంగా కాస్త ముందుకు తీసుకువచ్చి, స్వతంత్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ చేయడం జరిగింది. ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై భారీ హైప్ ని తీసుకువచ్చిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళి శర్మ తదితరులు నటిస్తుండగా, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మరి, ఇన్ని అంచనాల మధ్య త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, ఆ అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో వేచి చూద్దాం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: