రాజ్ తరుణ్.. పరిచయం అవసరంలేని పేరు. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరస హిట్లు పడినా.. క్రమంగా మెల్ల మెల్లగా తాను చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈయన గ్రాఫ్ పడిపోసాగింది. ప్రస్తుతం రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదలవుతుంది. అయితే ప్రపంచవ్యాప్తం కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనాని కట్టడి చేసేందుకు దేశదేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. అందుకు కూడా మినహాయింపు కాదు. ఇక్కడ కూడా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించింది కేంద్రం. దీంతో సినిమా హాల్స్, షూటింగ్ అన్ని బంద్ అయ్యాయి. అలాగే రాజ్ తరుణ్ సినిమా కూడా వాయిదా పడింది. వరస ఫ్లాపులతో ఉన్న రాజ్ తరుణ్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే ఒరేయ్ బుజ్జిగా.. చిత్రాన్ని నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లోకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు రాజ్ తరుణ్ రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. సినిమా రిజల్ట్ ని బట్టి తప్పకుండా మంచి ఎమౌంట్ ఇస్తామని నిర్మాతలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ కాలేని పరిస్థితి. దీంతో రాజ్ తరుణ్ ఆదాయం ఈ ఏడాది సున్నా అని తెలుస్తోంది. ఈ పరిస్థితులను బట్టీ అందరూ రాజ్ తరుణ్ సినిమా కెరీర్ ముగిసిపోయినట్టే అని అంటున్నారు. ఏదేమైనా రాజ్ తరుణ్ ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పాలి.