చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు జోడీగా ఎవరు నటించలేదు. రామ్ చరణ్ జోడీగా మాత్రం పూజ హెగ్డే నటించింది. అయితే పూజా హెగ్డే స్థానంలో మొదటగా రశ్మికనే అనుకున్నారు కానీ ఆ సినిమా నుఆమె తిరస్కరించింది. కారణం ఏదైనా కానీ ఆ సినిమా ఫ్లాప్ లో ఆమె భాగం కాలేదు. దానికి ఆమె అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.
తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఆమె ఓ సినిమా ఫ్లాప్ నుంచి తప్పించుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాలో ముందుగా రశ్మికనే హీరోయిన్ గా అనుకున్నారు. ఆ సినిమా కూడా చేయలేకపోయింది. ఈ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆమె ఆడింది. ఇప్పుడు బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమాలో నటిస్తుంది. ఇంకా పలుసినిమాలలో కూడా నటిస్తుంది. ఇవి తప్పకుండ హిట్ అవుతాయనే ఆమె అనుకుంటుంది. ఇక తెలుగులో ఆమె చేస్తున్న భారీ సినిమా పుష్ప 2 మంచి విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి భవిష్యత్ లో ఆమె ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతుందో చూడాలి.