పటాస్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ గా పరిచయం అయ్యాడు యాదమ్మ రాజు. కమెడియన్ గా పటాస్ షో లో ఎన్నో ఎపిసోడ్ల లో  చేసిన యాదమ రాజు దాని అనంతరం కొన్ని కారణాలవల్ల పటాస్ షో నుండి తప్పుకున్నాడు. తర్వాత జీ తెలుగు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే కామెడీ షోలో యాదమ్మ రాజుకి అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు యాదమ్మ రాజు. సద్దాం తో కలిసి టీం లీడర్ గా దూసుకుపోతున్నాడు యాదమ్మ రాజు. తాజాగా ఈయన ప్రేమించిన స్టెల్లాని కూడా వివాహం చేసుకున్నాడు. స్టెల్లా సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అందరికీ పరిచయమైంది. 

దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇరు కుటుంబాలని ఒప్పించి తాజాగా పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే యాదమ రాజు ఎంత కట్నం తీసుకున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యాదమ్మ రాజు స్టెల్లాని వివాహం చేసుకోవడానికి ఎలాంటి కట్నం కూడా తీసుకోలేదని తెలుస్తోంది. యాదమ్మ రాజు కట్నం తీసుకోకపోవడంతో స్టెల్లా తల్లిదండ్రులు ఆమెకి కొంత బంగారం ఇచ్చారట. దాంతోపాటు యాదమ్మ రాజుకి కూడా కొంత బంగారాన్ని స్టెల్లా కుటుంబ సభ్యులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

దీనికి మించి యాదమ్మ రాజుకి స్టెల్లా కుటుంబ సభ్యులు ఎలాంటి కట్నం ఇవ్వలేదు అని తెలుస్తుంది. ఇక ఈ వార్త తెలిసిన అనంతరం చాలామంది విశ్లేషకులు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా స్టెల్లా ని వివాహం చేసుకున్నందుకు గాను అభినందిస్తున్నారు. దీంతో చాలామంది త్వరలోనే హైపర్ ఆది కూడా ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే యాదమ రాజు మరియు స్టెల్లా హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహాన్ని జరుపుకున్నారు. ఇక యాదమ్మ రాజు హిందువు కాగా  స్టెల్లా క్రిస్టియన్. దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రేమలో ఉన్న వీరిద్దరూ వారి వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: