సినీ ఇండస్ట్రీ నటుల్లో ఒకరైన సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ఉన్నారో మనందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి టైం లో కొన్ని వేల మందికి ఆయన సహాయం చేసి కలియుగ కర్ణుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోను సూద్.
రీల్ లైఫ్ లో విలన్ గా నటించినప్పటికీ ఆయన రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో నటిస్తూ పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. అప్పటి కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకు, ఇప్పటికీ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు సోను సూద్ గారు.

కరోనా మహమ్మారి తరువాత సోనూ సూద్ ని అభిమానించే వారి సంఖ్య  విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా సోనూసూద్ హైదరాబాద్ లో సందడి చేశారు. కొండాపూర్ లో ఉన్న జిస్మత్ అరబిక్ రెస్టారెంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద సోనూ సూద్ మండి ప్లేట్ ని స్టార్ట్ చేసారు. ఆ మండిలో ఉన్న ప్లేట్ ఓపెనింగ్ ఫంక్షన్ కు నటి హిమజ ఇంస్టాగ్రామ్ పద్దు పద్మావతి తో పాటుగా పలువురు సెలబ్రిటీలు సైతం అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరం. మరి ముఖ్యంగా ఇక్కడ అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇండియాలోనే అతిపెద్ద మండి ప్లేట్ ని స్టార్ట్ చేయడం అనేది నాకు చాలాఆనందంగా ఉంది అన్నారు. అంతేకాకుండా ఈ మండి ప్లేట్ అనేది ఎవరు ఊహించని రీతిలో ఉంది అని తెలిపారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ మండి ప్లేట్ ఎనిమిది అడుగులో ఉంటుందని ఈ ప్లేట్ లో ఏకంగా 20 మందికంటే ఎక్కువగా తినొచ్చు అని రెస్టారెంట్ నిర్వాహకులు అన్నారు. ఈ అతి పెద్ద మండి మా అన్ని బ్రాంచుల్లో ఉంటుంది అని వారు చెప్పారు. కాగా సోనూ సూద్ కొండాపూర్ లోని జిస్మత్ అరబిక్ రెస్టారెంట్ వస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలాగే  సోనూ సూద్ తో కలిసి సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున పోటీపడ్డారు. కాగా ప్రెసెంట్  అతిపెద్ద మండి ప్లేట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ప్లేట్ ని చూసిన నెటిజెన్స్ ఇదంతా చూసి ఆశ్చర్యం గురి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: