మన తెలుగులో కొందరు నటులు సినిమాలు చేసినా చేయకపోయినా వార్తల్లో మాత్రం కనపడుతూ ఉంటారు. వారికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకునే వారు విజయశాంతి. టాలీవుడ్ లేడీ అమితాబచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఆమె సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనే సంగతి తెలిసిందే. విజయశాంతి అటు రాజకీయాల్లోనూ బిజీ బిజీగా ఉన్నారు. అయినా సరే ఆమె గురించి మాత్రం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది అని కూడా తెలుస్తుంది.
ఆ ఆఫర్ ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని అక్కడ తెలుగు హీరో ఒకరు చేసే సినిమాకు గానూ ఆమెను అడిగినట్టు తెలుస్తుంది. ఆమె కూడా అందుకు ఓకే చెప్పారు అని సమాచారం.
కథ ఏంటీ సినిమా దర్శకుడు ఎవరు అనేది తెలియదు గాని ఆమెకు మాత్రం ఆఫర్ వచ్చింది అని ఆమె కూడా కొన్ని కారణాలతో కథను ఓకే చేసారు అని కూడా ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు మరో మంచి ఆఫర్ కూడా వచ్చింది అని తెలుస్తుంది. మెగా హీరో రామ్ చరణ్ తర్వాత చేయబోయే అనీల్ రావిపూడి సినిమాలో ఆమె చరణ్ కి అమ్మగా నటించే అవకాశం వచ్చింది అని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె ఆ సినిమాను ఓకే చేస్తారు అని సమాచారం. ముందు పారితోషికం విషయంలో ఆమె బెట్టు చేశారన్న టాక్ వచ్చినా.... ఇప్పుడు అలా లేదని అంటున్నారు.