ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారు.కానీ ఇది మల్టీస్టారర్ సినిమా కాబట్టీ ఆ సినిమా క్రెడిట్ ఇద్దరు హీరోలకు చెందుతుంది.ఇటు తారక్ rrr మూవీ సెట్స్ పై ఉండగానే సోలోగా త్రివిక్రమ్ తో ఓ సినిమాను ప్రకటించేశాడు. కానీ ఇప్పుడు  రామ్ చరణ్ చేతిలో అటువంటి సినిమా ఏదీ లేదు.  అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్టయినట్లు తెలుస్తోంది.

 గతంలో వీరిద్దరి కాంబినేనషన్లో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్‌గా మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ - వివి వినాయక్ ముఖ్య అతిథులుగా ఓ ప్రాజెక్టు స్టార్టయ్యింది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది.వీళ్లిద్దరూ ఎవరి ప్రాజెక్టులో వారు బిజీ అయిపోయారు. ప్రస్తుతం కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు కలసిసంయుక్తంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆచార్య సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

చిరు 152వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కాబోతోంది. అదే సమయంలో కొరటాల శివ నెక్స్ట్ అల్లు అర్జున్‌తో ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం 'ఆచార్య' తో పాటు బన్నీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కొరటాల శివ..రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కొరటాల శివ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: