పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా ఎన్నడూ లేనంత జోరుమీద వరుసగా సినిమాలు వరుసగా ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ వాటితో పాటు మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. అవి మాత్రమే కాక పవన్ తో సినిమాలు చేయడానికి మరో ఇద్దరు దర్శకులు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రాబోయే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా అంజలి, నివేద థామస్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల హిందీలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న పింక్ మూవీకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ వకీల్ సాబ్ స్క్రిప్ట్ ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు వేణు శ్రీరామ్ కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు మరోవైపు అతి త్వరలో క్రిష్ తో చేస్తున్న పీరియాడికల్ సినిమా తదుపరి షెడ్యూల్ లో పాల్గొననున్న పవన్, ఆ తరువాత హరీష్ శంకర్ తో ఒక సినిమా, సురేందర్ రెడ్డి తో ఒకటి, యువ దర్శకడు సాగర్ వి చంద్ర తో మరొక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

కాగా తన స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ సినిమా స్టోరీ అదిరిపోయిందని, పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసారని అంటున్నారు. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉంటుందని, ఇక రిలీజ్ తరువాత ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం పవన్, సురేందర్ రెడ్డి ల కాంబో సినిమా అదే రేంజ్ లో అదరగొడితే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనే చెప్పాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి: