
అందంలో సహజం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్యం.. కన్నప్పకు సర్వస్వం.. ఈ నెమలి అంటూ చిత్ర బృందం ప్రీతిని పరిచయం చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నెమలిగా ప్రీతి ముకుందన్ మంచు విష్ణుతో రొమాన్స్ చేయడమే కాకుండా కత్తి విన్యాసాలు, యుద్ధాలు, యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కనిపించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది.

అలా వచ్చిన గుర్తింపుతోనే వెండితెరపై అడుగుపెట్టింది. తెలుగులో కన్నప్పనే ప్రీతి ముకుందన్ తొలి సినిమా అనుకుంటారు. కానీ కాదు.. కన్నప్ప కన్న ముందే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన కామెడీ హారర్ ఫిల్మ్ `ఓం భీమ్ బుష్(2024)` తో ప్రీతి టాలీవుడ్ తో పాటు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది `స్టార్` అనే చిత్రంతో కోలీవుడ్లోకి ప్రవేశించింది. ఇక కన్నప్పలో మొదట కృతి సనన్ చెల్లెలు నూపుర్ సనన్ ను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అయితే ఆమె సడెన్ గా తప్పుకోవడంతో ఆడీషన్ లో మెప్పించిన ప్రీతి ముకుందన్ ను నెమలి పాత్రకు ఖరారు చేశారు. దాంతో రెండో సినిమాకే ప్రభాస్ తో స్క్రీన్ చేసుకునే అదృష్టం ప్రీతికి దక్కింది. కన్నప్ప విజయవంతం కావడంతో ప్రీతి ముకుందన్ కు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తలుపు తట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది.