
వర్షాకాలంలో అతిగా దాహం వేయడానికి కారణాలు చాలా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఇది వాతావరణంలో తేమ పెరగడం, చెమట పట్టడం మరియు శరీరానికి తగినంత నీరు అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తే ఛాన్స్ ఐతే ఉంటుందని చెప్పవచ్చు. దీనిని అధిగమించడానికి, మీరు ఎక్కువ నీరు త్రాగడంతో పాటు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి.
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం పెరగడం వల్ల చెమట ఎక్కువగా పట్టే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి దాహం వేసే ఛాన్స్ ఉంటుంది. తగినంత నీరు తాగకపోతే, శరీరంలో నీటి శాతం తగ్గి దాహం వేసే అవకాశాలు ఉంటాయి. వర్షాకాలంలో కూడా కొన్ని రోజులు వేడిగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా పట్టడంతో పాటు దాహం వేసే అవకాశాలు ఉంటాయి.
కొన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, దాహాన్ని పెంచే చాన్స్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు అనారోగ్య సమస్యల వల్ల కూడా శరీరంలో నీటి శాతం తగ్గి దాహం వేసే ఛాన్స్ ఉంటుంది. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి దాహం వేయకుండా ఉంటుందని చెప్పవచ్చు. పండ్లు మరియు కూరగాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు దాహం తగ్గుతుంది.
జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండి, ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేడి పదార్థాలు, ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు దాహాన్ని పెంచుతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల చెమట ఎక్కువగా పట్టి దాహం వేస్తుందని చెప్పవచ్చు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మేలు చేస్తుంది.