బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌ను కళింగ సేన నాయకులు బెదిరించారు.   ఓడిశా వాసులు బాలీవుడ్ బాద్షాపై తమకున్న 17 ఏళ్ల నాటి కోపాన్ని ఇంకా మరచిపోలేదు. మరో నాలుగు రోజుల్లో మెన్స్ హాకీ వరల్డ్ కప్ పోటీలు ఒడిశాలోని కళింగ మైదానంలో ప్రారంభం కానుండగా, దీనికి షారూక్ అతిథిగా హాజరు కానున్నారు.  తొలి మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా షారూక్ ఖాన్‌ను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన షారూక్.. వేడుకలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, తనకు క్షమాపణలు చెప్పకుండా షారూక్ వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్థానిక కళింగ సేన నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Shah Rukh Khan

అయితే దీనికి వెను అసలు కథ ఏంటంటే..  17ఏళ్ల క్రితం షారూక్ అశోక అనే సినిమాలో నటించారు. అశోకుని పథాన్ని మార్చిన కళింగ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. కరీనా కపూర్, జుహీ చావ్లా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంతోశ్ శివన్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఒడిశా సంస్కృతిని, ఆ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఈ సినిమా ఒడిశాలో కేవలం వారం రోజుల పాటే నడిచింది.

Image result for కళింగ సేన నాయకులు

ఈ వివాదంపై అప్పటి నుంచి ఇప్పటివరకు షారూక్ స్పందించకపోవడంపై కళింగ సేన నాయకులు గుర్రుగా ఉన్నారు. అప్పటి కళింగ వాసుల ఆగ్రహం ఇప్పటికీ షారూక్ ను వెంటాడుతోంది. క్షమాపణలు చెప్పకుండా వస్తే, ఇంక్ చల్లుతామని, నల్ల జెండాలు ఎగరేస్తామని,  మా కార్యకర్తలు దారి పొడవునా ఉంటారు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ, కళింగ సేన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: