మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించడంతో రామ్ చరణ్ కు కూడా గ్లోబల్ గా ఈ మూవీ ద్వారా గుర్తింపు లభించింది. ఇలా అంతర్జాతీయ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని శంకర్ పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నాడు.

దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అంజలి ... సునీల్ ... శ్రీకాంత్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జై సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 మూవీ గా రూపొందుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా పొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ సంవత్సరం మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే దిల్ రాజు ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు "సీఈవో" అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఈఓ అంటే చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసస్ అని అర్థం అని తెలుస్తుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గ కనిపించబోతున్న నేపథ్యంలో ఈ మూవీ కి ఈ టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: