తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు తీయడంలో ఆయన స్టైలే వేరు. సినిమాని చాలా న్యాచురల్ గా ఎలాంటి ఓవర్ యాక్షన్స్ లేకుండా చాలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తాడు.తమిళ నాట లోకేష్, శంకర్, మురుగదాస్ వంటి దర్శకులు వున్న వెట్రి మారన్ కి వున్న క్రేజ్ మాత్రం చాలా ప్రత్యేకం. అయితే ఆయన ఓ తెలుగు సినిమా చేస్తారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్ల నుండి కూడా వార్తలొస్తున్నాయి.అయితే ఎట్టకేలకు వెట్రిమారన్‌ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమా సంగతి కూడా తెలిసిపోయింది.వెట్రిమారన్‌ తెరకెక్కించిన 'విడుదల పార్ట్‌ 1' సినిమా త్వరలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వెట్రిమారన్‌ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్‌తో సినిమా ఇంకా మహేష్‌ బాబుతో సినిమా గురించి చెప్పుకొచ్చారు.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని 'ఆడుకాలం' సినిమా రిలీజ్ తర్వాత కలిశానని, అయితే ఆయనతో సినిమాకి సంబంధించి కథ ఏది కుదరలేదని వెట్రిమారన్‌ చెప్పడం జరిగింది.మహేశ్‌బాబును కలిసి ఒక కథని చెప్పా. ఎందుకో ఆ సినిమా కూడా సెట్ కాలేదు . అయితే రాబోయే రోజుల్లో సూపర్ స్టార్‌తో ఖచ్చితంగా ఓ మంచి సినిమా చేస్తానని చెప్పారు.ఇక వెట్రిమారన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'విడుదలై పార్ట్‌ 1' ఇటీవల తమిళంలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఘన విజయం దక్కించుకోవడమే కాదు. విమర్శకులను కూడా ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు తెలుగులో 'విడుదల పార్ట్‌ 1' పేరుతో ఏప్రిల్‌ 15 వ తేదీన అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేస్తున్నారు.వెట్రిమారన్‌ ప్రస్తుతం 'విడుదలై పార్ట్‌2' తెరకెక్కించే పనిలో ఉన్నారు.తెలుగు ప్రమోషన్స్ పూర్తి చేసుకున్నాక సూర్యతో 'వాడివాసల్' సినిమా పనుల్లోకి దిగుతారు. ఆ తర్వాత 'విడుదలై 2' సినిమా కూడా వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: