సుధీర్ , రష్మి.. వార్తల్లో ఈ పేరు ఎక్కడ కనిపించినా కూడా ఇక ఆ న్యూస్ తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులందరూ కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతలా ఇక తెలుగు బుల్లితెరపై ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించింది వీరిద్దరి జోడి. అయితే కేవలం టిఆర్పి రేటింగ్ కోసమే వీరి మధ్య లవ్ ఉన్నట్లుగా చూపించారా లేకపోతే నిజంగానే రష్మీ సుధీర్ ప్రేమలో ఉన్నారా అన్న విషయంపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు.కానీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మాత్రం ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.



 పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశ పడుతున్న అభిమానులు కూడా కోట్లలోనే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత అటు సుధీర్, రష్మీ లవ్ ట్రాక్లకు బ్రేక్ పడింది. ఎప్పుడో ఒకసారి వీరిద్దరూ కలిసి కనిపించడం తప్ప.. ఇక ఒకప్పటిలా తరచూ బుల్లితెర వేదికలపై సందడి చేయడం లేదు ఈ జంట. అయితే ఇక ఇటీవలే సుదీర్ తో లవ్ సక్సెస్ అవుతుందా లేదా అని రష్మీ ఒక గేమ్ ఆడింది. కానీ ఈ గేమ్లో ఓడిపోయింది.


 దీంతో సుధీర్, రష్మీ లవ్ సక్సెస్ అవ్వనట్లేనా అని ఎంతోమంది చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా అటు రష్మీ ఒక ఫన్నీ గేమ్ ఆడింది. ఆర్య సినిమాలో లాగా ఒక బాక్స్ ఏర్పాటు చేశారు. అందులో రాయి పడితే లవ్ సక్సెస్ అవుతుంది అని రష్మీ మనసులో అనుకుంటుంది. కానీ ఆ రాయి ఇక ఆ బాక్స్ లో పడలేదు అన్నది మాత్రం అర్థం అవుతుంది. దీంతో రష్మీ షాక్ అవుతుంది. ఇక తన లవ్ సక్సెస్ కాదేమో అని భయపడిపోతుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: