ఇస్మార్ట్
శంకర్ సినిమా తో సూపర్ హిట్ అందుకొని
రెడ్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న
రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళంలో
మాస్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న లింగు స్వామి ఇప్పుడు తెలుగు హీరో తో తొలి స్ట్రెయిట్ తెలుగు
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. గతంలో ఈ దర్శకుడు అల్లు
అర్జున్ హీరోగా ఓ
సినిమా చేయాలని భావించినా అది వర్కవుట్ అవ్వలేదు. దాంతో మళ్లీ తమిళంలోనే సినిమాలు చేయగా ఇప్పుడు
రామ్ తో
సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు.
ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటు ఉండగా ఇటీవల కాలంలో ఈ చిత్రం నుంచి వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తుండగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాపై ఒక పుకారు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం కోసం దర్శకుడు లింగుస్వామి అన్ని విభాగాలకు తన తన
చిత్ర పరిశ్రమ నుంచి తీసుకు రాగా కొన్ని ముఖ్య పాత్రలు కూడా
తమిళ నటులనే తీసుకున్నాడట.
అంతేకాదు
సినిమా చిత్రీకరణలో కూడా
తమిళ వాసన బాగానే గుప్పు మంటుందట. దాంతో
రామ్ తలపట్టుకుంటున్నారట. తెలుగు ప్రేక్షకులకు
తమిళ ప్రేక్షకులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా
సినిమా లేకపోతే వారు ఏమాత్రం మెచ్చుకోరు. దాంతో ఈ చిత్రాన్ని
తమిళ వాసన లేకుండా తెలుగులో ఉండే విధంగా రామ్ దర్శకుడిపై కొత్త ప్రెషర్ పెడుతున్నాడట. మరి లింగుస్వామి ఈ సారి రామ్ మాట విని ఈ
సినిమా స్టైల్ ని మారుస్తాడా లేదా
తమిళ ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాలు చేస్తాడా అనేది చూడాలి.