ఫిదా
సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను తొలి సినిమాతోనే ఎంతగానో ఆకట్టుకున్న నటి సాయిపల్లవి. అంతకు ముందు కొన్ని మలయాళ సినిమాల ద్వారా తెలుగులో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ
ఫిదా సినిమా తో అందరిని
ఫిదా చేయడం మాత్రమే కాకుండా తెలుగులో కూడా భారీ
మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంది. ఆ చిత్రంలో ఆమె చేసిన ఫోక్ సాంగ్ కు ప్రేక్షకులు పిచ్చెక్కి పోయారు. తన నటనతో నాట్యంతో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న
సాయిపల్లవి కోసమే ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు ఆమె అభిమానులు.
ఆమె నాగచైతన్యతో కలిసి నటించిన
లవ్ స్టోరీ చిత్రం 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఆమె ఎంతో హుషారుగా పాల్గొనగా ఇటీవలే ఓ ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ
సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.
శేఖర్ కమ్ముల గారు
ఫోన్ చేసి కథ నచ్చిందా అని అడగగానే నేను మనసులో ముందే ఓకే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. కథ కూడా బాగా నచ్చడంతో ఈ
సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ
సినిమా చేయడానికి ఆయన తో పాటు స్క్రిప్టు కూడా ముఖ్య కారణమని ఆమె వెల్లడించారు.
ఇక ఈ
సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా
సాయి పల్లవి మెగాస్టార్ చిరంజీవి తో వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెకు
చిరంజీవి సినిమాలో నటిస్తే ఎందుకు నో చెప్పారు అనే ప్రశ్న ఎదురుగా గా ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.
రీమేక్ సినిమా అవడం వల్లనే చిరు
సినిమా లోని పాత్రకు నో చెప్పానని ఆమె చెప్పారు. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన నటీ నటుల కంటే తాను బెటర్ గా నటిస్తానో లేదో అనే భయం తనలో ఉండ బట్టే అక్కడ
మెగాస్టార్ చిరంజీవి అని తెలిసినా కూడా సినిమాను రిజెక్ట్ చేయవలసి వచ్చింది అని ఆమె చెప్పారు.