సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ వస్తున్నాం . అయితే పెద్ద హీరో సినిమాలో చిన్న హీరో ..టైర్ 2 హీరో సినిమాలో టైర్ 3 హీరో ఇలా చూస్తున్నామే కానీ బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటించడం అరుదుగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అలా ఒక బిగ్ బడా పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఒక్కటి వచ్చిన సరే సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు.  అలాంటి కాంబో కోసమే వెయిట్ చేస్తున్నారు జనాలు.  అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఓ న్యూస్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. 


ఇద్దరు బడా పాన్ ఇండియా 100 కోట్ల స్టార్ హీరోస్ కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారట.  అయితే ఇది కేవలం గెస్ట్ పాత్రలుగా మాత్రమే అంటూ తెలుస్తుంది . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో బన్నీ - ప్రభాస్ లు గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట . రన్బీర్ కపూర్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ ఒక బిగ్ ప్రాజెక్టును తెరపైకి తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో ఆల్రెడీ బన్నీని ఓ పాత్ర కోసం చూస్ చేసుకున్నారట. ఇన్నాళ్లు ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది.



 ఇప్పుడు ప్రభాస్ కూడా ఇంకో పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . అయితే ఇద్దరిదీ కూడా తక్కువ టైం ఉండే పాత్ర అని..కానీ నెగటివ్గా చూపించబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అది పాజిటివ్ రోల్ నా..? నెగటివ్ రోల్ నా..? పక్కన పెడితే బన్నీ - ప్రభాస్ ని తెరపై ఒకే స్క్రీన్ పై చూడాలి అంటూ ఎప్పటినుంచో కోట్లాదిమంది జనాలు వెయిట్ చేస్తున్నారు . ఫైనల్ గా ఆ కోరిక తీరబోతుంది అని తెలియడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి ఖుషి గా ఉన్నారు . కానీ తెలుగు సినిమాలో నటిస్తే బాగుండేదిగా అంటూ మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: