ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ వరుసగా పెళ్లిపీటలెక్కుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. కెరీర్ టాప్ స్టేజ్‌లో ఉన్నప్పుడే జీవితంలో కొత్త అడుగు వేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. మొదటగా కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి, ఎటువంటి బజ్ లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంది. ఈ వార్త బయటకు వచ్చేసరికి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే కీర్తి ఇప్పుడే పెళ్లి చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.ఇప్పుడు అదే తరహాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తన ప్రియుడు విజయ్ దేవరకొండతో త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజమో అధికారికంగా ప్రకటించకపోయినా, అభిమానులు మాత్రం రష్మికవిజయ్ జంటను రియల్ లైఫ్‌లో చూడాలన్న ఉత్సాహంతో ఉన్నారు.


ఇలాంటి పెళ్లి వార్తలు వరుసగా వినిపిస్తుండడంతో ఇప్పుడు అభిమానుల్లో కొత్త కుతూహలం మొదలైంది – ఇండస్ట్రీలో తర్వాత పెళ్లి చేసుకునే హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వచ్చే ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పబోయే హీరోయిన్స్‌గా రెండు పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి.వాళ్లు మరెవరో కాదు – అందాల ముద్దుగుమ్మ తమన్నా భాటియా మరియు పూజా హెగ్డే. ఇద్దరూ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా మంచి గుర్తింపు సంపాదించారు. ఒకప్పుడు ఈ ఇద్దరూ ఇండస్ట్రీని తమ అందం, అభినయంతో ఏలేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న టఫ్ కాంపిటీషన్ కారణంగా తాము వేరే దారిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.



ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా త్వరలో తమ జీవిత భాగస్వాములను ప్రకటించే అవకాశం ఉందట. అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో “తమన్నా వెడ్డింగ్ నెక్స్ట్!” – “పూజా హెగ్డే కూడా రెడీ!” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అన్ని అనుకున్నట్లే జరిగితే వచ్చే ఏడాదిలో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: