గడిచిన 10 సంవత్సరాల క్రితం పునీత్ రాజ్ హీరోగా, డైరెక్టర్ జయంత్ సి.పరాన్జి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం " నిన్నిందాలే" . ఈ చిత్రంతోనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించింది హోంబలే ఫిలిమ్స్.. తమ మొదటి సినిమానే ఫ్లాప్ గా మిగిలింది. ఇక మొదటి సినిమానే సక్సెస్ కాకపోతే నిర్మాణ సంస్థలు నిలబడడం చాలా కష్టం, కానీ హోంబలే మాత్రం ఆ తర్వాత 10 ఏళ్ల పాటు తిరిగి చూసుకోలేదు. దేశంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఒకటిగా నిలిచింది. కేజిఎఫ్ చాప్టర్ 1 తో హోంబలే రాతలే మారిపోయాయి. ఆ తర్వాత వచ్చిన కేజిఎఫ్ 2, కాంతార, సలార్ , మహావతార్ నరసింహ వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ప్రొడక్షన్ సంస్థగా నిలిచింది.


ఇటీవల విడుదలైన కాంతార చాప్టర్1 సినిమా పెను సంచలనాలను సృష్టిస్తోంది. అయితే ఇంతటితో హోంబలే విజృంభన అయిపోలేదు.. రాబోయే రోజుల్లో అసలు సిసలైన పండగ రాబోతోంది.ఆ సంస్థ నుంచి మరిన్ని బడ చిత్రాలు రాబోతున్నాయి. హోంబలే చిత్రాన్ని నిలబెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 3, సలార్ 2 వంటి చిత్రాలు చేయబోతున్నారు. అలాగే మరొకవైపు మహా అవతార్ సిరీస్ లో భాగంగా పరుశురామ, కల్కి లాంటి చిత్రాలు కూడా రాబోతున్నాయి.


అలాగే ఇతర భాషలలోని టాప్ హీరోల చిత్రాలను, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు వినిపిస్తోంది హోంబలె. ప్రభాస్ తో ఒక సినిమా కమిట్మెంట్ ఉన్నట్లుగా సమాచారం. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ తో టైసన్ అనే సినిమా చేయబోతోంది. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో ఒక సినిమా చేయబోతున్నారట. సొంత భాషలో హీరో అయిన రక్షిత్ శెట్టితో కూడా రిచర్డ్ ఆంటోనీ, కాంతార చాప్టర్2, తమిళంలో సుధా కొంగర డైరెక్షన్లో హీరో సూర్య గా నటించబోతున్న ఒక చిత్రం. ఇలా పాన్ ఇండియా స్థాయిలో హోంబలే పేరు మారుమోగిపోయే చిత్రాలతో రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: