ప్రస్తుతం హీరోయిన్స్ లో వరుస స్టార్ ఛాన్సులతో ఫుల్ ఫాంలో ఉంది పూజా హెగ్దె. రీసెంట్ గా మహేష్ మహర్షిలో నటించి సూపర్ హిట్ కొట్టిన అమ్మడు ఓ పక్క త్రివిక్రం, అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా పూర్తి కాకముందే మరో రెండు ఛాన్సులు అందుకుందట. ఇదిలాఉంటే పూజా హెగ్దె వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తుందని అన్నారు. ఆ సినిమా కోసం 15 రోజులకే 2 కోట్లు తీసుకుంటుందని వార్తలు రాశారు.


అయితే ఇలాంటి రూమర్స్ కు ఛాన్స్ ఇవ్వకూడదని పూజా హెగ్దె ఆ సినిమా ఛాన్స్ వదులుకుందని తెలుస్తుంది. తక్కువ డేట్స్ ఎక్కువ పారితోషికం అని మీడియా తనని ఆడేసుకుంటుండగా ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చేయకపోవడమే తన కెరియర్ కు మంచిదని భావిస్తుంది పూజా హెగ్దె. అందుకే వాల్మీకి సినిమాకు డేట్స్ కుదరదని చెప్పిందట.


కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. తమిళంలో బాబీ సిం హా చేసిన ఈ పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తుండటం విశేషం. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో తమిళ నటుడు అధర్వ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. 


వాల్మీకి సినిమాలో పూజా హెగ్దె లేకపోవడం ఆమె ఫ్యాన్స్ కు కొద్దిగా నిరాశకలిగించినా ఆమె ప్లేస్ లో ఏ హీరోయిన్ ను తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ డైరక్షన్ లో సినిమా ఓకే చేశాడు. ఆ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: