అయితే ఆ తావతా ప్రస్తుతం ఏపీలో నగర పాలిత ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మళ్ళీ అదే పాత పాడుతున్నారు. ఈ సారి ఒక అడుగు ముందుకేసి మరీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గర నుండి, నరసాపురం, రామచంద్రాపురం, జంగారెడ్డి గూడెం ఇలా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు జాన్సెనకు మద్దతుగా ప్రచారాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లాలో జనసేన తరపున 25 వ వార్డ్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న రంజిత్ కు మద్దతుగా టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ కూడా ప్రచారం చేసినట్లు సమాచారం. అయితే ఈ విధంగా ఓపెన్ గా ప్రచారం చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి. కానీ దీనిపై జనసేన మాత్రం మేము టీడీపీ తో కలవడం లేదు.
ఈ వ్యాఖ్యలతో మాకు ఎటువంటి సందర్భం లేదని చెబుతూ వస్తోంది. ఇదంతా చూస్తుంటే జనసేన వలన టీడీపీకి ఎంతవరకు ఉపయోగం ఉందో తెలియడం లేదు. కానీ ఇక్కడ రెండు విషయాలు అర్ధం కావడం లేదు. టీడీపీ కావాలనే జనసేనతో కాళ్లభేరానికి వస్తోందా...లేదా దీని వలన మనకు కొన్ని సీట్లు వస్తాయని, వారు వేస్తున్న ప్రణాళికలో భాగమా ...ఏది ఏమైనా జనసేన పార్టీకి టీడీపీ బలమా బలహీనతా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.