అయితే ఇక ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లపై దాడులు చేయడానికి అటు అమెరికా ప్రభుత్వం నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు అందుతుంది అనే చెప్పాలి.
అయితే అటు ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ఓవైపు తాలిబన్ మూకలపై దాడులు చేసినప్పటికీ తాలిబన్లు మాత్రం ప్రభుత్వం చర్యలకు దీటుగా మరింత రెచ్చిపోతున్నారు. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పటికే తాలిబన్ల బారినపడి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి.
ఇలాంటి సమయంలో ఇటీవలే ఏకంగా తాలిబన్లు భారత్కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చేపట్టిన అభివృద్ధి ప్రశంసించదగినది అంటూ తాలిబన్ అధికార ప్రతినిధి మహమ్మద్ సుహైల్ షాహిన్ అన్నారు. అందుకే భారత రాయబార కార్యాలయంపై తాము దాడులు నిర్వహించబోము అంటూ స్పష్టం చేశారు కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి భారత్ సహాయం చేయకపోతే భారత్కు అన్ని విధాలుగా మంచిది అంటూ ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సైనిక జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది అని ఇతర దేశాల జోక్యాన్ని అసలు సహించబోమని అంటూ స్పష్టం చేశారు ఆయన.