ఆ నియోజకవర్గంలో వైసీపీకి సెట్ కావడం లేదా వరుసగా ఇన్‌ ఛార్జ్ లు మారుస్తున్న ఆ పార్టీ ఐదో కృష్ణున్ని తెర మీదకు తీసుకొచ్చిందా ? ఎవరో వస్తారని భావిస్తే ఇంకా ఎవరు వస్తున్నారా? ఈసారైనా ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తుందా ? ప్రకాశం జిల్లా అద్దంకిపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో ఉన్నారు. అద్దంకి ఇన్‌ ఛార్జ్‌గా పిడుగురాళ్లకు చెందిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను నియమించారు. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన అశోక్ కుమార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో అద్దంకి బాధ్యతలు ఇచ్చారు. 2024 ఎన్నిక ముందు పాణెం చిన హనిమి రెడ్డిని నియమించింది. వైసీపీ గొట్టిపాటి రవికుమార్ కు దీటైన అభ్యర్థి అవుతారని భావించినా తేలిపోయారు. ఎన్నికల తర్వాత అద్దంకి వైపే చూడ‌ట్లేదు.


అద్దంకిలో వైసిపి ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీకి జై కొట్టారు. దీంతో అదే నియోజకవర్గానికి చెందిన సీనియ‌ర్ నేత బాచిన చెంచు గరటయ్యకు 2019లో అవకాశం ఇచ్చారు జగన్. ఆ తర్వాత ఆయన కుమారుడు బాచిన కృష్ణ‌ చైతన్యకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. వైసీపీ అయితే చైతన్యకు కేడర్ లో మంచి మార్కులు పడకపోవడం నియోజకవర్గంలో గ్రూపులు తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన పాణెం చినహానిమిరెడ్డిని 2024 ఎన్నికల్లో పోటీకి దింపింది. వైసిపి.


అయితే ఆయన కూడా అక్కడ గెలవలేకపోయారు. తాజాగా పిడుగురాళ్లకు చెందిన చింతలపూడి అశోక్ కుమార్ కు అవకాశం ఇచ్చారు జగన్. దీంతో ఆ నియోజకవర్గ వైసిపిలో ఐదే కృష్ణుడు ఎంట్రీ ఇచ్చినట్లయింది. అయితే అద్దంకి బాధ్యతలు సీనియ‌ర్ నేత కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్ కు ఇస్తారని .. ఫైన‌ల్‌గా 2029 ఎన్నిక‌ల వేళ క‌ర‌ణం వెంక‌టేశే ఇక్క‌డ క్యాండెడ్ అవుతార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: