ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన కొద్ది గంటల్లోనే మరో దిగ్గజ హీరో మృతి చెందారు. బాలీవుడ్లో నిన్నటి తరం లెజెండ్రీ నటుడు రిషీ కపూర్ (67) గురువారం మృతిచెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో చికిత్స పొందుతూ ఆయన గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన నిన్నటి తరం బాలీవుడ్ హీరోలలో అందమైన హీరోగా ప్రసిద్ధి చెందారు. ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఆయన కుమారుడే కావడం విశేషం.
#RishiKapoor (67) passes away after being admitted to a mumbai hospital. pic.twitter.com/KIJ2xmCEj1
— Sreedhar Pillai (@sri50) April 30, 2020