గతవారం విడుదలై బాలీవుడ్ లో అఖండ విజయం సాధించిన 'గల్లీ బాయ్' మూవీ పై మెగా కాంపౌండ్ దృష్టి పడటమే కాకుండా ఈమూవీ సాయి ధరమ్ తేజ్ కు అన్ని విధాలా సరిపోతుందని భావించి ఈమూవీని అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ ద్వారా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈవార్తలు వచ్చి ఒకరోజు కూడ పూర్తి కాకుండానే కొందరు మెగా అభిమానులు ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ అభిమానులు తేజ్ ను ఇలాంటి సాహసం చేయవద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నట్లు సమాచారం. 

అంతేకాదు ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసి వరస పరాజయాలు ఎదుర్కున్న సాయి ధరమ్ తేజ్ నటనా సామర్ధ్యానికి కాని అదేవిధంగా తేజ్ బాడీ లాంగ్వేజ్ కి కానీ 'గల్లీ బాయ పాత్ర ఏమాత్రం సరిపోదనీ తేజ్ అభిమానులు మెగా మేనల్లుడుకి సందేశాలు పంపుతున్నట్లు టాక్. ఇలాంటి సాదాసీదా కథను తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరని అదీకాకుండా రణ్వీర్ సింగ్ నటించిన స్థాయిలో భావోద్వేగాలు పండిస్తూ నటించే సామర్ధ్యం సాయి ధరమ్ తేజ్ కు లేదు అన్న విషయం అతడి అభిమానులే సున్నితంగా గుర్తుకు చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. 

అదేవిధంగా తేజ్ ఇప్పటి వరకు నటించిన ఈసినిమాలను తనలోని అద్భుతమైన నటనను బయటకు తీయని నేపథ్యంలో రణ్వీర్ సింగ్ 'గల్లీ బాయ్ ఏమాత్రం తేజ్ కు సరిపోదనీ మెగా అభిమానుల అభిప్రాయం. దీనికితోడు మన  ఇరు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల ప్రేక్షకులకు ఈమూవీ కథలో భావోద్వేగం పూర్తిగా అర్ధం కాదు అన్న సూచనలు కూడ కొందరు తేజ్ కు చేస్తున్నట్లు టాక్, 

దీనితో 'గల్లీ బాయ్' రీమేక్ ఆలోచనలను అల్లు అరవింద్ పూర్తిగా వదులు కోవచ్చు అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో 'చిత్రలహరి' తరువాత తేజ్ నటించడానికి సరైన సబీజెక్ట్ కూడ దొరకకపోవడం ఒక విధంగా తేజ్ ను కలవర పెట్టే విషయాలు  అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: