రమేష్ (గంగ), నళిని హీరో హీరోయిన్లు గా నటించిన "ప్రేమ సాగరం" 1983 వ సంవత్సరంలో విడుదలై అప్పటి ప్రేక్షకులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. ఈ సినిమాలో నళిని.. రమేష్ తో కలసి అన్ని హద్దులు దాటి మరీ రొమాన్స్ చేసి సెగలు పుట్టించారు. ఈ సినిమాలో రాజేందర్, సరిత కూడా జంటగా నటించారు. అయితే టి. రాజేందర్ దర్శకత్వం వహించిన ప్రేమ సాగరం సినిమా కి స్వర్ణ సుందరి నిర్మాతగా వ్యవహరించారు. తమిళం లో విడుదలైన ఉయిరుల్లవరై ఉషా సినిమాని తెలుగులో "ప్రేమ సాగరం" సినిమాగా అనువదించారు.

అయితే తమిళంలో మాత్రమే కాదు ఇది తెలుగులో, హిందీలో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సూపర్ హిట్ రొమాంటిక్ సినిమా కి విజయ టి. రాజేందర్ సంగీత బాణీలు సమకూర్చారు. కాగా ఈ సినిమా యొక్క తమిళ వర్షన్ పాటలను, తెలుగు వర్షన్ పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. అయితే ఈ చిత్రం లో ఒక వర్షం పాట ఉంటుంది. ఈ పాటలో నళిని, గంగ వర్షంలో తడుస్తూ కామ కార్యకలాపాలకు తెర లేపుతారు.



తెల్ల చీర కట్టుకొని వర్షంలో తడుస్తూ ఉన్న నళిని తో గంగ గాఢమైన రొమాన్స్ చేస్తుంటాడు. నళిని ఈ పాటలో తన తడి తొడల అందాలను చూపించి మతులు పోగొట్టారు. తడిచిన తన చీరను ఆరబెట్టే దృశ్యాలు కూడా ప్రేక్షకులను రొమాంటిక్ ఫీలింగ్స్ తో ఉక్కిరి బిక్కిరి చేసాయనే చెప్పుకోవాలి. "నీలో నాలో మొహాలన్నీ మొగ్గలేస్తే... నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే... చిందదా.. తొలిసుఖం యవ్వనం.. తొలిసుఖం.." అంటూ సాగే ఈ వర్షం పాట యూట్యూబ్ లో 30 కోట్ల వ్యూస్ సంపాదించడం విశేషం.

అయితే ఈ రొమాంటిక్ ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్.జానకి ఆలపించారు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: