పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటికే తమన్ అదిరిపోయే రేంజ్ పాటలను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ తన పూర్వపు మూవీ ల మాదిరి గానే ఈ మూవీ ని కూడా అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ , శంకర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. శంకర్ గారి వర్క్ కు తాను 1992 సమయం నుంచే పెద్ద అభిమాని ని అని , ఆయన తో పని చెయ్యడం ఒక డ్రీం లాంటిది అని రామ్ చరణ్ తెలిపాడు. అలాగే తాము లేటెస్ట్ గా అయితే న్యూయార్క్ షెడ్యూల్ కోసం పయనమవుతున్నట్టు కూడా రామ్ చరణ్ కన్ఫర్మ్ చేసాడు. రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: