'ఆర్ ఆర్ ఆర్' మ్యానియా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ట్రిపులర్ మరోసారి సత్తా చాటింది. తాజాగా హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. తన సోదరుడు తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ వెళ్లలేకపోయాడు.కానీ రామ్ చరణ్ మాత్రం వెళ్లడంతో హాలీవుడ్ మీడియా ఫోకస్ అంతా అతని మీద పడింది. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డ్స్ వేడుక వచ్చే నెల జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అవార్డ్స్ వేడుకకు ఎన్టీఆర్ వెళ్లబోతున్నారట. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 5న ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ వేడుక కోసం అమెరికా వెళ్లరున్నారట. అక్కడే అకాడమీ అవార్డులు వేడుక ముగిసేంతవరకు ఉంటాడట. ఈ లోపు పలు హాలీవుడ్ మీడియా చానల్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఒక్కరే కాదు అతనితో రామ్ చరణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ లో 'నాటు నాటు' అనే సాంగ్ కి ఆస్కార్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్ళీ అమెరికాలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. మార్చి 13వ తేదీన ఆస్కార్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరగబోతోంది.

ఈ వేడుకకి ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అలాగే లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా వెళ్తున్నారట. ఆస్కార్ నామినేషన్ కి వెళ్లిన నాటు నాటు సాంగ్ కి లైవ్ కన్సర్ట్ కూడా ఈ అకాడమీ ఈవెంట్స్ లో భాగంగా ఉండే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి మరోసారి మన టాలీవుడ్ హీరోలు గ్లోబల్ స్టార్ గా మారి అమెరికాలో సందడి చేయబోతుండడంతో.. ఆస్కార్ అవార్డ్స్ వేడుకల కోసం ఇప్పుడు మా టాలీవుడ్ ఆడియన్స్ అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు.ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్లి వచ్చిన తర్వాత కొరటాల శివ సినిమాని ప్రారంభిస్తాడని తెలుస్తోంది. మార్చి మూడో వారంలో ఎన్టీఆర్, కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: