క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ "పుష్ప". ప్రతి చిత్రంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. ఆసక్తికరమైన కథలను తనదైన శైలిలో ప్రేక్షకులు మెచ్చేలా చూపించే సుకుమార్ తన సినిమాలలో స్పెషల్ సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. తన తొలి చిత్రం "ఆర్య" నుండి ఇటీవలి బ్లాక్ బస్టర్ "రంగస్థలం" వరకు ప్రతి సినిమాలోని స్పెషల్ ఐటమ్ నంబర్స్ ఓ ఊపు ఊపేశాయి. 'ఆర్య' నుండి ‘అ అంటే అమలాపురం’, 'ఆర్య 2' నుండి ‘రింగా రింగా’ అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్‌ల కలయికలో సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్. ఇప్పటికీ ఆ సాంగ్స్ విన్పిస్తూనే ఉంటాయి. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా సుకుమార్ తన తదుపరి చిత్రం "పుష్పా" కోసం ప్రత్యేక ఐటమ్ సాంగ్ ను తెరకెక్కించబోతున్నాడు. 

ఈ సాంగ్ పై చాలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు. ఈ ప్రత్యేక పాట కోసం "పుష్ప" మేకర్స్ సన్నీ లియోన్‌ను సంప్రదించారని, ఆమె 50 లక్షల రూపాయలను వేతనంగా అడిగిందని తెలుస్తోంది. అంతకుముందు ఈ స్పెషల్ సాంగ్ కోసం దిషా పటాని, నోరా ఫతేహిలతో పాటు ఇతరుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ సన్నీ లియోన్ ఈ పాట చేయాలని బన్నీతో పాటు దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారట. దానికో స్పెషల్ రీజన్ ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కు టాలీవుడ్, బాలీవుడ్ లతో పాటు కేరళలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదే కోవలో సన్నీ లియోన్ కు కూడా అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఆమె ఈ ప్రాజెక్టులో చేరితే ఖచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బన్నీ అండ్ టీం భావిస్తున్నారట. మరి సన్నీ కోరినంత ఇచ్చి ఆమెను ప్రాజెక్టులో చేర్చుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: