స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మురళీకృష్ణ మరియు శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారని తెలుస్తుంది.

సింహా మరియు లెజెండ్ సినిమాలను మించి అఖండ విజయం సాధించడం విశేషం.చాలా రోజుల తర్వాత ఫ్యామిలీలు సైతం ఈ సినిమా చూడటానికి థియేటర్లకు వస్తున్నాయని తెలుస్తుంది.. అఖండ సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నా బాలయ్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేశారట..

అఘోరా పాత్రలో బాలయ్యను తప్ప మరో నటుడిని ఊహించుకోలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని తెలుస్తుంది.. అయితే ఈ సినిమాను చూడటానికి నిజమైన అఘోరాలు థియేటర్లకు రావడం విశేషం.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో అఖండ ప్రదర్శితమవుతుండగా ఏ థియేటర్ దగ్గర చూసినా జై బాలయ్య అంటూ అరుపులు మారుమ్రోగుతున్నాయట.విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఉన్న బంగార్రాజు థియేటర్ కు నిజమైన అఘోరాలు వచ్చారని తెలుస్తుంది.

ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన అఘోరాలు బాలయ్య అఘోరా పాత్రలో బాగా నటించాడని సినిమా బాగుందని మీడియాకు చెప్పారట.. ఆ తర్వాత శివ నామస్మరణ చేస్తూ అఘోరాలు బయటకు వెళ్లిపోయారని తెలుస్తుంది.ఈ విషయం తెలిసిన అభిమానులు ఇదీ బాలయ్య రేంజ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని తెలుస్తుంది.. అఘోరాలు థియేటర్ కు వచ్చిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయని తెలుస్తుంది.ఫుల్ రన్ లో అఖండ ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉందని తెలుస్తుంది.. అఖండ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య మార్కెట్ పెరగడం విశేషం..బాలయ్య అఖండ విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు.ఇదే ఊపు మీద తన తరువాత సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమా అఖండ మించి ఉండాలని మంచి స్టోరీ బిల్డ్ చేయమని దర్శకుడికి సూచించాడట.మరి చూడాలి బాలయ్య తరువాత ఎలాంటి కథ చేస్తాడో

మరింత సమాచారం తెలుసుకోండి: