ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే రాష్ట్రం చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీఎం జగన్ కూడా ఇప్పుడు కరోనా రెండో వేవ్ మొదలైతే ఎలా వ్యవహరించాలి అనే దాని పై అధికారులకు పలు సూచనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇప్పుడు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా అప్రమత్తం అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ బృందాలను అదేవిధంగా వైద్య పరికరాలను అలాగే కరోనా టెస్ట్ కిట్స్ ని ఎక్కువగా పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ మేరకు నిధులు ఇవ్వటం లేకపోతే కనుక పరికరాలను పంపించడం ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో మరి ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి.