ఆ విధంగా టీఆర్ఎస్ డీఎన్ఏ ఉన్న ఈ లీడర్ ఆర్ఎస్ఎస్ భావోద్వేగాలతో నడిచే పార్టీలో ఇప్పటిదాకా బాగానే నెట్టుకువచ్చారు. తనదైన పంథాలో సమస్యలపై గళం వినిపించారు. కాస్త సున్నిత మనస్తత్వం ఉన్న నేతగానే ఆయనకు పేరున్నా తనకు అన్నం పెట్టిన వామపక్ష వాదాన్ని ఇవాళ ఆయన విమర్శిస్తుండడమే ఆశ్చర్యకరం. రాజకీయం కదా రంగులు మారుస్తుంది అని సర్దుకుపోవాలి. ఇక ఆఖరుగా ఉన్న నేత ఈటెల సర్. సీనియర్ కమ్యూనిస్టు అని కూడా రాద్దాం ఏం కాదు. వామపక్ష భావజాలం ఉన్న ఈ నేత కూడా బీజేపీలో ఎలా ఇమడగలరు అన్న మాట ఒకటి వినిపించింది. ఈయన కూడా సున్నిత మనస్కుడే! మరీ! నోరేసుకుని పడి పోయే రకం కాదు కానీ పొర్లి పొర్లి ఏడ్చే రకం. అదే పెద్ద తలనొప్పి. మొన్నటి వేళ ఆ రకం ఏడుపు పనికివచ్చినా ఇకపై మాత్రం అస్సలు వర్కౌట్ కాదు భయ్యా! ఏదేమైనప్పటికీ బీజేపీ ఇవాళ ఈ ముగ్గురిపైనే ఆశలు పెట్టుకుంది. వీరే తమ బలం అని భావిస్తోంది. అసెంబ్లీలోనూ బయట కూడా వీరు వినిపించే మాటలే ఇవాళ రేపు ఆ పార్టీ బలపడేందుకు ఆలంబన కానున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి