
అయితే ఆ సమయంలో టిడిపి ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. సురేంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. అయితే ఆయనకు ఏమీ కాలేదని విషయం తెలియగానే కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు..ముఖ్యంగా తన నియోజకవర్గంలో కూడా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి మంచి పేరు సంపాదించారు. 2024 శాసనసభ ఎన్నికలలో 37వేల ఓట్లతో గెలిచారు. అయితే అలాగే భైరవాణి తిప్ప నీటిపారుదల ప్రాజెక్టును సైతం తాను గెలిచిన వెంటనే రెండేళ్లలో పూర్తి చేస్తానంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇక ఈ టీడీపీ ఎమ్మెల్యే చదివింది కేవలం పదవ తరగతి మాత్రమే నట.. ఈయన ఆస్తి కూడా సుమారుగా అఫీడవిట్లో 189 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలియజేశారు. ఇక కళ్యాణ్ దుర్గానికి సంబంధించిన అన్ని పనులను తానే దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందే ఆ ప్రాంతంలో ఈయన హవ్వ బాగా కొనసాగింది.రాయలసీమలో అత్యధికంగా పేరు పొందిన ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు ఆమిలినేని సురేంద్రబాబు. మరి ప్రమాద సంఘటన పైన టిడిపి ఎమ్మెల్యే అభిమానులకు ఎలాంటి విషయం తెలియజేస్తారో చూడాలి మరి.