ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో ఓలా తన మార్క్‌ను చూపించడంలో సక్సెస్ అయ్యింది. బ్రాండ్ కి ఉన్న ఇమేజ్ కారణంగా చాలా మంది వినియోగదారులు ఓలా స్కూటర్ల కొనుగోలుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిగిలిన కంపెనీలు కూడా ఏమాత్రం తగ్గకుండా ఓలా కంపెనీకు పోటీగా కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి.ఫీచర్లు, బుల్డ్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా చాలా పోటీనిస్తున్నాయి. ఇలా ఓలా స్కూటర్లకు పోటీగా జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ బ్యాట్ రీ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టోరి నాలుగు కొత్త రంగుల్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాట్ రీ పేరుతో వస్తున్న ఈ స్కూటర్ ఐస్ బ్లూ, స్ట్రైట్ బ్లూ, క్యాండీ రెడ్, ఎక్రూ రంగుల్లో ఉంటుంది. ఇప్పటికే ఈ స్కూటర్‌ బ్లాక్, స్టార్మీ గ్రే ఇంకా ఎలక్ట్రిక్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ధరతో పాటు ఫీచర్ల విషయంలో ఈ స్కూటర్ ఓలా ఎస్ 1 ఎయిర్‌కు బాగా పోటీగా నిలవనుంది.ఇక ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే..ఈ స్కూటర్ ధర రూ.89,600 (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంటుంది.


ఇంకా అలాగే ఈ స్కూటర్ 2 కేడబ్ల్యూ హబ్ బీఎల్‌డీసీ మోటర్ నుంచి పవర్ ని కూడా పొందుతుంది. ఓ చార్జ్‌తో ఏకంగా మొత్తం 132 కిలో మీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.ఇంకా అలాగే గరిష్టంగా గంటకు 62 కిలో మీటర్ల స్పీడ్‌తో ఈ స్కూటర్ దూసుకుపోతుందట. అలాగే కేవలం ఐదు గంటల్లో ఈ స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేయవచ్చని కంపెనీ వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం యువత అమితంగా ఇష్టపడే రంగుల్లో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల సేల్స్ ఇంకా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇందులో మెటల్ ప్యానెల్స్‌ను ఉపయోగించారు. అలాగే బ్లూటూత్ కనెక్టవిటీతో కూడిన ఐదు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కూడా అమర్చారు. టెలి మెట్రీ, కాల్ ఇంకా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఇంకా నావిగేషన్ వంటి సౌకర్యాలను ఈ స్కూటర్ ద్వారా పొందవచ్చు. ఈ స్కూటర్ కేవలం ఓలా ఎస్ 1 ఎయిర్‌తో పోటీ పడడమే కాకుండా ఒకయా, ఒకెనివా, అంపెర్ ఇంకా అలాగే ప్యూర్ ఈవీ వంటి కంపెనీల స్కూటర్లకు గట్టి పోటీనిచ్చేలా దీని డిజైన్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: