రిటైర్మెంట్ తర్వాత సమయం వృధాగా పోతుందని ఆలోచించిన సత్యనారాయణ రెడ్డి ఎంటెక్ చదవాలని ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. అంతేకాదు చదవాలనే వారికి వయసు అడ్డురాదని నిరూపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా. JNTU లో ఎమ్ టెక్ పూర్తి చేసిన ఈయన అనుకోకుండా జాతీయ స్థాయిలో గేట్ పరీక్షలో 140 వ ర్యాంకు సాధించడంతో ప్రతి ఒక్కరు షాక్ కి గురి అవుతున్నారు. 2019లో JNTU సివిల్ విభాగంలో ఎంపీ లో చేరిన 2022లో అండర్ JNTU కింద ఎంటెక్ పూర్తిచేశారు.
ఇటీవల జరిగిన 2022 గేట్ పరీక్షలు జియో మాటిక్స్ ఇంజనీరింగ్ పేపర్ లో ఈయన 140 వ ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇకపోతే గేట్ సాధించిన అభ్యర్థులు ఉన్నతవిద్య ప్రవేశానికి మూడు సంవత్సరాల పాటు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ముంబైలోని రౌర్కెల లో ఉన్న ఐఐటీలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం, రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు.. ఏదైనా సాధించాలి అంటే అందుకు వయసు అవసరం లేదు కేవలం కృషి, పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని ఈ పెద్దాయన నిరూపించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి