ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బంగారం కొనడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా పెరుగుతూ ఇప్పుడు లక్ష రూపాయల వరకు వెళ్లిపోయింది. అయితే ఇలా పెరగడానికి కూడా ముఖ్య కారణం ప్రజలేనని చెప్పవచ్చు. కానీ మీడియాలో ఎప్పుడూ కూడా బంగారు పెరుగుతుందని చెబుతూ ఉండడంతో చాలామంది మీడియా వారు బంగారుకొట్టు వాళ్లకు అమ్ముడుపోయారేమో అన్నట్లుగా మాట్లాడుకున్నాము. కానీ బంగారు వ్యాపారుల యొక్క ట్రాప్ సరిగ్గా ఇప్పుడు పనిచేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి యుద్ధాలు వచ్చిన సందర్భాలలో బంగారం ధరలు పెరిగినాయి అంటే ఒక అర్థం ఉన్నది.


రష్యా, ఉక్రేయన్ యుద్ధం ముగింపు దశకు వచ్చింది.. చైనా తైవాన్ యుద్ధం చేసే ధైర్యం చాలట్లేదు.. ఇజ్రాయిల్ ను పాలస్తిన యుద్ధం అది కూడా పతన స్థాయికి పడిపోయింది.. అన్ని చోట్ల కూడా అమెరికా డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. పైగా అమెరికా కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి తనదైనటువంటి ఒత్తిడి చేసి మరి తమ దేశాన్ని డెవలప్మెంట్ చేసుకుంటుంది. అంటే ఆర్థికంగా కూడా అమెరికాను పశిష్టంగా ఉంచుకునేలా చేస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపుగా తీసుకువెళ్తోంది. అంతర్జాతీయంగా కూడా చాలా మార్పులు చేసుకొనేలా చేస్తోంది అమెరికా.


అయితే ఇప్పుడు మనం అటు నుంచి పక్కకు వెళ్లిపోయి ఎక్కడికి తీసుకు వెళ్ళామంటే.. అర్జెంటుగా మనం తీసుకువెళ్లినటువంటి రూల్ ఏంటయ్యా అంటే.. బంగారాన్ని మనం లక్ష రూపాయల వరకు తీసుకువెళ్లే పనిగానే నడుస్తున్నది.. ఇప్పుడు ఎస్టేజ్ కి చేరకూడదో ఆ స్టేజ్ కి చేరిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే  ఇప్పుడు.. లక్షా 40 వేల రూపాయలకు తీసుకువెళ్లాలని చూస్తూ ఉన్నారు.. ఇవాల్టికి ఇవాళ మన దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకువెళ్లి.. బంగారు షాపుల వాళ్లకి ఈ రేటుకి అమ్ముతానంటే కొనేవాళ్లు ఎంతమంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.. మరి రాబోయే రోజుల్లోనైనా బంగారం తగ్గుతుందా లేకపోతే ఏంటా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: