ఈ టీ తాగండి.. సర్వ రోగాలు పోగొట్టుకోండి..?

అల్లం, యాలకులు, లవంగం వంటి  మసాలా దినుసులు మన ఇళ్లలో తయారు చేసే టీలో ఉపయోగిస్తారు. ఇవి టీ రుచిని బాగా పెంచుతాయి.అలాగే ఈ మసాలా దినుసుల లక్షణాలు శరీరానికి కూడా లభిస్తాయి. ఇంకా పసుపు కూడా పోషకాహారంతో నిండి ఉంటుంది. అందుకే దీన్ని టీలో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీ అందరికీ ఎంతో ప్రయోజనకరమైనదే అయినప్పటికీ, పసుపులో ఉండే కర్కుమిన్ వల్ల అలెర్జీ ఉన్నవారు కొంతమంది ఉంటారు. కాబట్టి వారు మాత్రం ఈ టీకి దూరంగా ఉండాలి.ఇంకా ఎవరైనా అనారోగ్యంతో, ప్రత్యేక మందులు తీసుకుంటే, అప్పుడు గోల్డెన్ మిల్క్ టీని డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే త్రాగాలి.ఈ గోల్డెన్ మిల్క్ టీ ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. ఎందుకంటే ఇది కెఫిన్ లేనిది, ఇది నిద్రపోవడానికి బాగా సహాయపడుతుంది. అందుకే గోల్డెన్ మిల్క్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. 


ఎవరైనా పసుపు అలెర్జీ కలిగి ఉంటే ఈ టీని తీసుకునే ముందు నిపుణుడి సహాయం తీసుకోవాలి.ఇంకా ఈ గోల్డెన్ మిల్క్ టీ చర్మ కాంతిని పెంచడానికి బాగా పనిచేస్తుంది. ఇది స్కిన్ ఇన్‌ఫెక్షన్‌ని తగ్గించి, ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో  సహాయపడుతుంది. అలాగే చర్మం మంట కూడా తగ్గుతుంది.పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక నొప్పులు ఇంకా కండరాల నొప్పులు నయమవుతాయి.అందుకే పసుపు టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.అలాగే పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇక ఇది బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న సమ్మేళనం. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇంకా తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.కాబట్టి రెగ్యులర్ కాఫీ, టీ బదులుగా ఈ టీ తాగండి. ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: