ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువత నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిద్ర అనే విషయమే మర్చిపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సెల్ ఫోన్ ప్రపంచం లోకి వెళ్ళిన తర్వాత తినాలి అనే ఆలోచన, నిద్ర పోవాలనే కోరిక రెండూ పుట్టవట. కాబట్టి సరైన సమయానికి తిని , కంటినిండా నిద్ర పోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు చెబుతున్నారు.
సరైన నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం , వాంతులు, అసిడిటీ, సరిగ్గా జీర్ణం కాకపోవడం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. వైద్యులు ఎంత హెచ్చరించినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు.. ఒక్కసారి అనారోగ్య సమస్యలు చుట్టుముడితే హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోక పోయినా కూడా చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.. కానీ చాలామంది ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.. కానీ ఒక్క రోజు కూడా నిద్ర పోకపోయినా ఎంతో ప్రభావం చూపిస్తుందట..
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 7 నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలి. ఇక నిద్ర ను కోల్పోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని ఒక పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.