రాజు గారి గది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజు గారి గది మూవీ మంచి విజయం సాధించడంతో అశ్విన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ యువ నటుడు పలు సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. 

అశ్విన్ ముఖ్యంగా రాజు గారి గది 2 ... రాజు గారి గది 3 మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అశ్విన్ తాజాగా హిడింబా అనే మూవీ లో హీరో గా నటించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నందిత శ్వేతా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ కన్నెగంటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల తేదీని మే 10 వ తేదీన ప్రకటించనున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ అశ్విన్ కు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: