అలా తెలుగులో వరుస సినిమాల అవకాశాలు కొట్టేస్తున్నాడు మాధవన్. ప్రస్తుతం ఏ సినిమా లో విలన్ పాత్ర కి అవకాశం వచ్చిన ఆయన పేరే వినబడుతుంది. సెలెక్ట్ అవుతారు లేదో తెలియదు గాని ఆయన పేరును మాత్రం మొదట పరిశీలిస్తున్నారు మేకర్స్. సవ్యసాచి, నిశ్శబ్దం చిత్రాలతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన మాధవన్ ఈ సినిమాల తర్వాత చాలా తెలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయట.
ఇప్పటికే రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో విలన్ గా మాధవన్ ని అనుకుంటున్నా రు అని వార్త లు వస్తుండగా మహేష్ బాబు సర్కా ర్ వారీ పాట సినిమాలో కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా ఆయన ప్రధాన పాత్రలో నటింప చేయాలని కొంతమంది కథలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారట. మొత్తానికి ముదురు వయసులో ఉన్న ఈ హీరో వెంట మన టాలీవుడ్ మేకర్స్ పడటం కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నటనా పరంగా ఆయన ప్రేక్షకులను అలరించడం తో పాటు కూడా మేకర్స్ నీ కూడా ఎంతగానో సంతృప్తి పరుస్తాడు.