శేఖర్ కమ్ముల సినిమాలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఆయన సినిమాలు ఆడియన్స్ను విపరీతంగా కట్టుకుంటాయి .అయితే ఆయన ఎప్పుడూ ఒకేలాంటి సినిమాలను కాకుండా యూత్ ను బాగా ఆకట్టుకునే సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆనంద్ గోదావరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలతో ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక చివరిగా ఆయన సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా చేశారు. కాగా ఈ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఒక అందమైన ప్రేమ కథ గా వచ్చిన 

ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు పోటీపడి నటించారు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరొక భారీ సినిమాతో త్వరలోనే ముందుకు రాబోతున్నాడు శేఖర్ కమల. తమిళ స్టార్ హీరో ధనుశ్ తో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కుబేర అని వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సైతం ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తిరుపతిలో నిర్వహించారు. అయితే ధనుష్ ఈ సినిమాలో ఒక బిచ్చగాడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా  లో ఓ సన్నివేశం కోసం ధనుష్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ సన్నివేశం కోసం ధనుష్ ఓ డంపింగ్ యార్డ్ లో పది గంటలు గడిపారట.ధనుష్ తన పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంటాడు. ఇక ఇప్పుడు కుబేర కోసం డంపింగ్ యార్డ్ లో చెత్త పక్కన పదిగంటలు గడిపారట. అది కూడా మాస్క్ లేకుండా.. ఉన్నారట. తన క్యారెక్టర్ లో ఎంత పెయిన్ ఉంటుందో చూపించాలని ధనుష్ ఇంత కష్టపడ్డారట. ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ నుంచి అప్డేట్స్ కూడా రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: