తెలుగు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ తెలిపారు. మమితా బైజు గతంలో నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. మగధీర సినిమాను తాను 50సార్లు చూశానని ఆమె తెలిపారు. మలయాళంలో ధీర పేరుతో ఈ సినిమా డబ్ అయిందని మమితా బైజు అన్నారు. ఈగ సినిమా అంటే కూడా ఎంతో ఇష్టమని ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్క లేదని మమితా బైజు తెలిపారు.బన్నీకి నేను వీరాభిమానినని బన్నీ నటించిన ప్రతి సినిమాను నేను పది కంటే ఎక్కువసార్లు చూశానని ఆమె వెల్లడించారు. ఇప్పటికీ బోర్ కొడితే బన్నీ సినిమాలు చూస్తానని ఆమె పేర్కొన్నారు. జులాయి , ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో బన్నీ క్యాసియో వాచ్ ధరించడం చూశాక నాకు వాటిపై మక్కువ పెరిగిందని మమితా బైజు అన్నారు. స్కూల్ లో చదివే సమయంలో బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ ను అనుకరించారని ఆమె తెలిపారు. టామ్ బాయ్ లా స్కూల్ కు వెళ్లేదాన్నని మమితా బైజు వెల్లడించారు.తెలుగు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. తెలుగు చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. నటిగా మమితకు మంచి భవిష్యత్తు ఉందని అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రశంసించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. 'ప్రేమలు' క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని.. ఆమె గతంలో నటించిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అలా వచ్చిందే 'ప్రణయ విలాసం'. ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ తెలిపారు. మమితా బైజు గతంలో నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. మగధీర సినిమాను తాను 50సార్లు చూశానని ఆమె తెలిపారు. మలయాళంలో ధీర పేరుతో ఈ సినిమా డబ్ అయిందని మమితా బైజు అన్నారు. ఈగ సినిమా అంటే కూడా ఎంతో ఇష్టమని ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్క లేదని మమితా బైజు తెలిపారు.బన్నీకి నేను వీరాభిమానినని బన్నీ నటించిన ప్రతి సినిమాను నేను పది కంటే ఎక్కువసార్లు చూశానని ఆమె వెల్లడించారు. ఇప్పటికీ బోర్ కొడితే బన్నీ సినిమాలు చూస్తానని ఆమె పేర్కొన్నారు. జులాయి , ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో బన్నీ క్యాసియో వాచ్ ధరించడం చూశాక నాకు వాటిపై మక్కువ పెరిగిందని మమితా బైజు అన్నారు. స్కూల్ లో చదివే సమయంలో బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ ను అనుకరించారని ఆమె తెలిపారు. టామ్ బాయ్ లా స్కూల్ కు వెళ్లేదాన్నని మమితా బైజు వెల్లడించారు.తెలుగు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. తెలుగు చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. నటిగా మమితకు మంచి భవిష్యత్తు ఉందని అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రశంసించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. 'ప్రేమలు' క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని.. ఆమె గతంలో నటించిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అలా వచ్చిందే 'ప్రణయ విలాసం'. ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.