అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది.

ఇలా ధియేటర్ మరియు ఓ టి టి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా ఆ తర్వాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయింది. ఇక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కూడా ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ఏకంగా 29.4 పిఆర్పి రేటింగ్ దక్కింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా మొదటి సారి ప్రసారం అయినప్పుడు ఈ స్థాయి టిఆర్పి రేటింగ్ ను తెచ్చుకోలేదు.

మూవీ తర్వాత ఎన్నో స్టార్ హీరోలు నటించడం మూవీ లు బుల్లి తెరపై ప్రసారం అయ్యాయి. ఆ మూవీ లు అన్ని మొదటి సారి ప్రసారం అయ్యేటప్పుడు అలా వైకుంఠపురంలో సినిమా సాధించిన టిఆర్పి రేటింగ్ ను బీట్ చేసి కొత్త రికార్డును నెలకొల్పుతుందేమో అని ఎంతో మంది అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ మూవీ కి వచ్చిన టిఆర్పి రేటింగ్ను బీట్ చేయలేక పోతుంది. మరి అలా వైకుంఠపురంలో రికార్డును బ్రేక్ చేయడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa