అయితే వైసిపి పార్టీ గత ఎన్నికలలో నవరత్నాలనే తిరిగి అమలు చేస్తామని అయితే ఇందులో కొన్నిటిని మాత్రమే పెంచినట్లుగా ఆ పార్టీ ప్రకటించింది.. అయితే కూటమి నుంచి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయితే ఇది బిజెపికి సంబంధం లేదని తెలియజేసింది.కేవలం టిడిపి, జనసేన పార్టీలు మాత్రమే సూపర్ సిక్స్ పేరుట ఒక మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఇరు పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా గ్రౌండ్ రిపోర్టు సైతం మారిపోయింది. ఇటీవలే ఒక ప్రముఖ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషులు టిడిపి కూటమి వైపుగా ఎక్కువ మక్కువ చూపుతున్నారని మహిళలు మాత్రం ఏకపక్షంగా వైసిపి పార్టీ తరఫున మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 50.18 శాతం మంది కూటమి వైపు ఉన్నారని వైసీపీ విషయానికి వస్తే..46.5 శాతం మంది మాత్రమే మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. మహిళల విషయానికి వస్తే 57% వరకు వైసిపి మగ్గుచూపుతున్నారని కూటమికి 40 శాతం మంది మాత్రమే మద్దతు తెలుపుతూ ఉండడం గమనార్హం. అంటే దాదాపుగా 17% వరకు మహిళలు వైసిపి వైపే ఉన్నారు.
ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయడమే ఇందుకు ముఖ్య కారణమని అవి కూడా మహిళల పేరుతో మంజూరు చేయడంతో మరింత కలిసి వస్తోంది. అయితే చంద్రబాబు కూడా ఇటీవలే మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టిన అవి అమలయ్యే సాధ్యం కాదనే విధంగా ప్రజలు మాట్లాడు. ముఖ్యంగా మహిళా పథకాలే ఈసారి జగన్ను గెలిపిస్తాయని అందుకే అంత ధీమాతో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో పూర్తిగా తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..