తెలుగు సినీ పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఎస్ ఎస్ థమన్ ఒకరు. ఈయన చాలా సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చాలా వరకు ఈయన ప్రాంతీయ సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తూ వచ్చాడు. అవి సూపర్ సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దానితో ప్రస్తుతం అనేక థమన్ పాన్ ఇండియా మూవీ లకు కూడా సంగీతం అందిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం థమన్ చేతిలో మూడు పాన్ ఇండియా మూవీ లు ఉన్నాయి.

ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ని కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలుగా రూపొందుతున్న ఈ మూడు సినిమాలకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలు కనుక మంచి విజయం సాధించి , ఈ సినిమా ఆల్బమ్ లకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్లు అయితే తమన్ క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: